
హైదరాబాద్, 01 జూలై (హి.స.)
భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి
టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ రాత్రి 10 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో అర్థరాత్రి షురూ కానున్నాయి. ఇటీవల ఐర్లాండ్ సిరీస్ లో ఎత్తుగా ఓడిన భారత్, ఇంగ్లాండ్ పై మాత్రం మెరుగ్గా రాణించి.. సిరీస్ కైవసం చేసుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది. అటు న్యూజిలాండ్ చేతిలో 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్... మన ఇండియా పై టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అయితే నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైభవ్ కు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ లో బాగా ఆడిన వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తామని.. ఇప్పటికే కెప్టెన్ శ్రేయస్ వెల్లడించారు. అంటే ఈ లెక్కన సంజు తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. సంజు ఉంటే వైభవ్ కు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..