
అమరావతి, 29 జూలై (హి.స.)
విజయనగరం: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుని బుధవారం విజయనగరంలో తన స్వగృహంలో మంత్రులు పి.నారాయణ, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కలిశారు. అనంతరం శాలువాతో అశోక్ గజపతిరాజును సన్మానించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ఆయనతో కాసేపు చర్చించారు. వారి వెంట తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ