
యాదాద్రి భువనగిరి , 23 ఆగస్టు (హి.స.)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే కొండపైకి వాహనాలు మరియు భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం స్వామివారి ధర్మదర్శనం (ఉచిత దర్శనం) కొరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సుమారు 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని ఆలయ ఈఓ (EO) ఈరోజు మధ్యాహ్నం వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రసాదం కౌంటర్లు, కళ్యాణకట్టల వద్ద ఆలయ సిబ్బంది అదనపు ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi