మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
CUSTOMS SEIZED SMUGGLED GOLD


ముంబై, 25 ఆగస్టు (హి.స.)బంగారం ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బంగారం ప్రతిరోజూ కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంటోంది. అదేవిధంగా వారంలో మొదటి రోజైన ఈరోజు కూడా బంగారం ధరలు మళ్లీ గణనీయంగా పెరిగాయి. నిన్న ఒక తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.880 పెరిగింది. ఇప్పుడు అదే ధరతో కొనసాగుతోంది. బంగారం ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఆగస్ట్ 25న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89 పెరిగి, దాని ధర రూ. 16,397 కి చేరింది. 1 తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 890 పెరిగింది. ఈ బంగారాన్ని కొనడానికి ఈరోజు మీరు రూ. 1,63,980 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరగడంతో ఈ బంగారం రూ. 15,040కి చేరింది. అదే ఒక తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పెరగగా, దాని ధర రూ. 1,50,310 వద్ద ట్రేడవుతోంది.

అలాగే 24, 22 క్యారెట్ల బంగారం తర్వాత18 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర రూ. 62 పెరగగా, దీనిని కొనడానికి మీరు రూ. 12,294 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెరగగా, ఈ బంగారం రూ. 1,22,940కు అమ్ముడవుతోంది. ఇదిలా ఉండగా, వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. 1 గ్రాము వెండి రూ. 260కి అమ్ముడవుతోంది. 10 గ్రాముల వెండి ధర రూ. 2,600గా ఉంది. కాగా, 1 కిలో వెండి ధర రూ. 2,60,000కి చేరింది.

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande