హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు గల్లంతు?.. ఓటర్ల జాబితా సర్వేతో భారీ మార్పులు!
హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు గల్లంతు?.. ఓటర్ల జాబితా సర్వేతో భారీ మార్పులు!
హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు గల్లంతు?.. ఓటర్ల జాబితా సర్వేతో భారీ మార్పులు!


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)

రాజధాని హైదరాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) కారణంగా గ్రేటర్ పరిధిలో ఏకంగా 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేప‌టితో ఈ సర్వే కార్యక్రమం ముగియనుండగా, నిన్న‌టి వ‌ర‌కు ఉన్న సమాచారం ప్రకారం రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో ఉన్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు మూడో వంతు ఓట్లు రద్దయ్యే సూచనలు కనిపిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ సెలవులు ఉన్నప్పటికీ ఆది, సోమవారాల్లో బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లోనే ఉంటారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని ఓటర్లు ఎవరైనా ఉంటే వెంటనే అందజేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి, ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande