తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్
ఈ రోజు ఆదివారం ఉదయం స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు ఫుల్లయ్యాయి
తిరుమల


తిరుమల, 20 సెప్టెంబర్ (హి.స.)తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాల సందడి తారస్థాయికి చేరుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.

ఈ రోజు ఆదివారం ఉదయం స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు ఫుల్లయ్యాయి. ఉదయం 8 గంటల తర్వాతి నుంచి క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి 8-10 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.

నేడు ఉదయం మలయప్పస్వామి కోదండరాముడి అవతారం.. హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 గంటలకు గజవాహన సేవ నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande